ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు

ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు

పెద్దపల్లి: ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌‌లోని రాయ్‌‌పూర్‌‌కు వెళ్తోంది. రైలులో ఒక్కసారిగా మంటలు రావడాన్ని సిబ్బంది గమనించారు. పెద్దపల్లి సమీపంలోని చీకురాయి గేటు వద్ద రైలును నిలిపివేసి ఫైర్ సిబ్బంది, పోలీసులు కలసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఒక ఆక్సిజన్ ట్యాంకర్ కాలిపోయింది. రైల్వే సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.